Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేదార్నాథ్లో ప్రధాని
కేదార్నాథ్ : ఉత్తరాఖండ్లో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. కేదార్నాథ్ ఆలయంలో శనివారం పూజలు నిర్వహించిన తర్వాత సమీపం లోని ఓ గుహలో ధ్యానం చేశారు. మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నేడు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కేదార్నాథ్ పర్యటనలో ఉండటం గమనార్హం. కాషాయదుస్తులు ధరించి ధ్యానముద్రలో ఉన్న మోడీ ఫొటోను బీజేపీ రాష్ట్ర విభాగం ట్వీట్ చేసింది. దీనిపై నెటిజన్లు వ్యంగ్యోక్తులతో షేర్ చేశారు. మోడీ పాలన ముగిసిందని ఒకరు.. ఎన్నికల ఫలితాలపై కలవరాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం చేస్తున్నారని ఛలోక్తులు విసిరారు. కాగా, కేదార్నాథ్ ఆలయంలో పూజలు నిర్వహించేందుకు రెడ్ కార్పెట్పై నడుస్తుండగా తీసిన ఫొటోలో మోడీ వేషధారణపైనా కామెంట్లు వెల్లువెత్తాయి.