Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చివరి విడతలో 59 స్థానాలకు పోలింగ్
- బరిలో మోడీ, ఇతర ప్రముఖులు
- 23న కౌంటింగ్
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తుది సమరానికి సమయం ఆసన్నమైంది. దాదాపు రెండు నెలలుగా జరుగుతున్న ఎన్నికల సంగ్రామానికి నేటితో తెరపడనుంది. లోక్సభకు చివరి(ఏడో) విడత ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 59 స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఉత్తరప్రదేశ్ 13 నియోజకవర్గాలు, జార్ఖండ్ 3, మధ్యప్రదేశ్, 8, పంజాబ్ 13, పశ్చిమబెంగాల్లో 9, చండీగఢ్ 1, బీహార్ 8, హిమాచల్ ప్రదేశ్లో 4స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ చివరి విడత ఎన్నికల్లో మొత్తం 10.02 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5.27 కోట్లు, మహిళలు 4.75 కోట్లు, ఇతరులు 3,435 మంది ఉన్నారు. మొత్తం 918 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. మొత్తం 1,12,986 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇటీవల పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘర్షణల దృష్ట్యా ఎన్నికల సంఘం 710 కంపెనీల కేంద్ర బలగాలను కేటాయించింది. చివరి విడత ఎన్నికలు జరుగుతున్న 59 స్థానాల్లో 2014 గెలుచుకుంది. అయితే ఈ సారి బీజేపీకి భంగపాటు తప్పదనీ, ప్రముఖంగా ఆ పార్టీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, బెంగాల్లో సృష్టించిన అరాచకం నేపథ్యంలో గెలుచుకునే స్థానాల్లో భారీగా కోత పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయప డుతున్నారు. ఆదివారం పోలింగ్ జరిగిన అనంతరం వివిధ సంస్థలు ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేయనున్నాయి. ఈనెల 23వ తేదీన ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.
బరిలో ప్రముఖులు
చివరి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పోటీచేస్తున్న యూపీలోని వారణాసి నియోజకవర్గం ఈ విడతలోనే ఉంది. మోడీ ఈ స్థానం నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగారు. అయితే ప్రధానికి పోటీగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలబడతారని వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చుతూ గతంలో పోటీచేసిన అజరురారును ఈసారి కూడా నిలిపింది. పశ్చిమబెంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి సీపీఐ(ఎం) సీనియర్ నేత డాక్టర్ ఫౌద్ హలీం బరిలో ఉన్నారు.