Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పోటీపడి ప్రచారం నిర్వహించాయి. తమకు అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో పార్టీలు పోటీపడ్డాయి. సామాజిక మాధ్యమాల్లో విసృత ప్రచారం నిర్వహించాయి. ఆదివారంతో లోక్సభకు చివరి విడత ఎన్నికలు కూడా ముగిసాయి. ఈనెల 23న ఎన్నికల సంఘం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనుంది. అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అంశంలో మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది. ఎన్నికల సీజన్ వచ్చిన నాటి నుంచి అంటే ఫిబ్రవరి నుంచి మే వరకూ గూగుల్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి రాజకీయపార్టీలు దాదాపు రూ.53 కోట్ల మేర ఖర్చు చేశాయి. దీంట్లో సింహభాగం బీజేపీకి చెందింది.