Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్, శరద్ పవార్తోనూ మంతనాలు
- ఫలితాల తర్వాత సమావేశంపై విస్తృత మంతనాలు
- ప్రధాని మోడీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్న వేళ ఢల్లీలో జాతీయ రాజకీ యాలు ఆసక్తికరంగా మారాయి. ఒక వైపు విశ్లేషణలు, వ్యాఖ్యానాలతో నాయకు లంతా మునిగి తెలుతుంటే.. తెలుగు దేశంఅధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధానిలో బీజీబీజీగా గడుపుతున్నారు. ఆదివారం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరత్ పవార్తో మరోసారి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శనివారం బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో జరిగిన భేటీలో చర్చకు అంశాలను ఆయా నేతలకు వివరించినట్టు తెలిపారు. తుది దశ పోలింగ్ ముగియనుండటంతో తదుపరి కార్యాచరణపై ఆయా నేతలతో చర్చించినట్టు వెల్లడించారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చాక ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాల ముం దు, తర్వాత ఎలా వ్యవహరించాలనే దానిపై వ్యూహరచన చేసినట్టు ఏపీ సీఎం అధికారవర్గాలు స్పష్టం చేశాయి. ఫలితాల కంటే ముందే ఎన్డీయేతర కూటమి నేతలంతా ఒకసారి సమావేశమైతే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచా రం. అయితే, ప్రతిపక్ష పార్టీల సమావేశ తేదీపై ఇంకా స్పష్టత రాలేదని చంద్ర బాబు తెలిపారు. రాహుల్తో సుమారు 20 నిమిషాలు, ఏచూరితో గంట సేపు, సోనియాతో 15 నిమిషాలు భేటీ అయ్యారు. అనంతరం ఎన్సీపీ అధినేత శరద ్పవార్తోనూ సమావేశమైన చంద్రబాబు తాజా పరిస్థితులపై అరగంటపాటు చర్చించారు. మాయావతితో భేటీ సందర్భంగా ఆమె లేవనెత్తిన పలు అంశాలపై సోనియా, రాహుల్, ఏచూరి, పవార్కు వివరించినట్టు తెలిసింది. అయితే, ఈ తాజా రాజకీయ పరిస్థితిపై మాయవతి మరోసారి చర్చించేందుకు ఢిల్లీలో అందు బాటులో ఉండాలని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఒకవేళ కుదిరితే మాయావతితో రాహుల్, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు టీడీపీ నేతలు వెల్లడించారు. బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏకి పూర్తి మెజార్టీ రాని పక్షంలో అనుసరించాల్సిన కార్యాచరణ, బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతా టిపైకి తీసుకొచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో చంద్రబాబు పలుసార్లు సమావేశమయ్యారు.
ప్రధాని మోడీపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రచారం ముగిసిన తర్వాత కూడా మోడీ బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు పర్యటించడం కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితాలు వచ్చేదాకా కోడ్ అమలులో ఉంటుందని వివరించారు. మోడీ ఆధ్యాత్మిక పర్యటన పలువురు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉందని ఆరోపించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని మోడీ పూర్తిగా ఉల్లంఘించారని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ, అమిత్ షా వివిధ సందర్భాల్లో నియమావళిని ఉల్లంఘించిన అంశాలను తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. ఆదివారం గుజరాత్లోని ప్రసిద్ధ సోమ్నాథ్ ఆలయాన్ని సందర్శించిన విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు.