Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీరూ ఆ గుహలో సకల సౌకర్యాలతో ధ్యానం చేయొచ్చు
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో కేదార్నాథ్లోని గుహలో మోడీ ధ్యానం చేసినట్టే మీరూ చేయవచ్చు. రోజుకు రూ. 990 అద్దె కడితే మీరూ ఆ గుహలో ఉండొచ్చు. గుహ అనగానే ఎలాంటి వసతుల్లేకుండా చిమ్మచీకటిగా ఉండే సొరంగంలాంటి ఆకృతి మన కండ్లల్లో మెదులుతుంది. కానీ, కేదార్నాథ్ సమీపంలోని ఆ గుహలో అన్ని రకాల ఆధునిక హంగులున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. మోడీ ధ్యానం చేసిన గుహలో లగ్జరీ హౌటల్లో ఉండే సౌకర్యాలన్నీ ఉన్నాయి. పర్యాటకుల కోసం నిర్మించిన లగ్జరీ గుహ అది. ధ్యానం చేసుకునే గుహలను పాపులర్ చేసేందుకు గతేడాది కేదార్నాథ్లో ఈ గుహను నిర్మించినట్టు గర్వాల్ మండల్ వికాస్ నిగమ్(జీఎంవీఎన్) తెలిపింది. ఈ గుహలోని వ్యక్తికి 24 గంటలు అటెండర్ అందుబాటులో అటెండర్ కూడా ఉంటాడు. కాలింగ్ బెల్ గుహలోని అమర్చినట్టు జీఎంవీఎన్ తెలిపింది. అటెండర్ బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్తోపాటు, రోజుకు రెండు సార్లు చారు అందిస్తాడు. అంతే కాదు ఆ గుహలో తాగు నీటి వసతి, మొబైల్ఫోన్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ కూడా ఉన్నది. వాస్తవానికి ఈ గుహను రోజుకు రూ. 3వేలతో పర్యాటకులకు అద్దెకు ఇచ్చారని, ప్రస్తుతం అద్దెను రూ. 999కి తగ్గించినట్టు జీఎంవీఎన్ వివరించింది. ఏకాంత ప్రాంతంలో ఈ గుహను నిర్మించారని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే పర్యాటకుల కోసం గుహలో మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో పోలింగ్ జరుగుతుండగా.. మతపరంగా ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనే కేదార్నాథ్లో పర్యటించారని, అందుకే కాషాయ దుస్తులు ధరించి గుహలో ధ్యానముద్రలో కూర్చున్న ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారని విమర్శలు వచ్చాయి.