Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్డీయేకు అనుకూలంగా వచ్చిన తరుణంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఎన్డీయే నేతలకు విందు ఇచ్చారు. ఢిల్లీలోని అశోకా హౌటల్లో ఇచ్చిన విందులో ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే పక్షాలకు చెందిన పలువురు పాల్గొన్నారు. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం పళనిస్వామి, ఎల్జీపీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్తో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు, ఎన్డీయే నేతలు, కేంద్ర మంత్రులతో పార్టీ ప్రధాన కార్యాలయంలో మోడీ, అమిత్షా భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తులో అనుసరించాల్సి వ్యూహం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.