Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈవీఎంల అక్రమాలపై స్పష్టమైన ఆధారాలున్నా ఈసీ మౌనంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈవీఎంలపై పలు సందేహాలు వెల్లడవుతున్నా ఈసీ వివరణ ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఈవీఎంలను మేనేజ్ చేయడం, ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ను వ్యూహాత్మకంగా వెల్లడించడం చూస్తుంటే మరో బాలాకోట్ తతంగాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తోందని మెహ బూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అను గుణంగా సార్వత్రిక సమరంలో బీజేపీ గెలుపొందినా.. ముంచి కోసం ప్రజలు జరిపే పోరాటం ఆగరాదని ముఫ్తీ పేర్కొ న్నారు.. వ్యవస్ధలను నిర్వీర్యం చేయడం, సమగ్రతను దెబ్బతీ యడం వంటి విపరిణామాలకు వ్యతిరేకంగా సమాజం, జర్నలి స్టులు నిబద్ధతతో పోరాటం కొనసాగించాలని ఆమె తెలిపారు.