Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీ అభిప్రాయాలను నమోదు చేయాల్సినవసరం లేదు : ఎన్నికల కోడ్ వ్యవహారంపై
కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా లేవనెత్తిన వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సమావేశమైంది. ఎన్నికల కోడ్కు సంబంధించిన వ్యవహారాల్లో మైనారిటీ అభిప్రాయాలు, నిర్ణయాలను నమోదు చేయడం లేదని లావాసా అసంతృప్తి వ్యక్తం చేయ డంతో కేంద్ర ఎన్నికల సంఘంలో లుకలుకలు మొదలైన విషయం తెలిసిందే. దీనిపై చర్చించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల కోడ్కు సంబంధించిన వ్యవహారాల్లో మెజారిటీ నిర్ణయాన్ని మాత్రమే పరిగణ లోకి తీసుకుంటారని స్పష్టం చేసింది. ఈ విషయంలో మైనారిటీ అభిప్రా యాలను నమోదు చేయాల్సిన అవసరం లేదని సీఈసీ తెలిపింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుశీల్ చంద్ర, అశోక్ లావాసా లతో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం(మొత్తం ముగ్గురు సభ్యులు) సమావేశమై 2-1 మెజారిటీతో ఈ నిర్ణయాన్ని తీసు కున్నది. అయితే క్వాసీ జ్యుడీషియల్ అంశాలలో మాత్రమే మైనారిటీ అభిప్రా యాలను నమోదు చేస్తారని సునీల్ అరోరా తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ అంశం క్వాసీ జ్యుడీషియల్ కిందకు రాదని, ఈ కారణం తోనే మైనారిటీ అభిప్రాయాలను నమోదు చేయడంలేదని వివరిం చారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ, అమిత్షా లపై ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి అందిన ఫిర్యాదుల విషయంలో ఎన్నికల సంఘంలోని సీఈసీ, మరో ఈసీ తీరు లావాసాకు అసహనాన్ని తెప్పించింది. మోడీ, షా కోడ్ ఉల్లంఘించలేదని సీఈసీ, మరో ఈసీ క్లీన్చీట్ ఇవ్వగా, లావాసా మాత్రం దీనిని వ్యతిరేకించారు. నిటి అయోగ్, పీఎంవో లకు ఈసీ క్లీన్చిట్ ఇవ్వడాన్ని కూడా ఆయన విభేదించారు. కోడ్ ఉల్లంఘనలపై ఇప్పటికే సీఈసీ సునీల్ అరోరాకు లావాసా మూడు సార్లు లేఖ రాశారు. అయితే లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పందించిన సునీల్ అరోరా.. ఈ మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఈసీ పనితీరు బీజేపీకి అనుకూలంగా ఉన్నదని పలు ఆరోపణలు వినబడిన సంగతి తెలిసిందే.