Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరుక్కుపోయిన ప్రయాణికులు
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైళ్లో సాంకేతిక సమస్య కారణంగా ప్రయాణికులు నాలుగు గంటల పాటు రైళ్లోనే ఉండిపోవాల్సి వచ్చిం ది. మంగళవారం గుర్గావ్ నుంచి ఢిల్లీని కలిపే మెట్రో మార్గంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 9:30 గంటల సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మధ్యాహ్నం 1:30 గంటల వరకు గుర్గావ్ - ఢిల్లీలను కలిపే మెట్రో మార్గంలో సేవలు నిలిచిపోయాయి. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆగిపోయిన మెట్రో రైళ్లలో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించారు. ఈ విషయమై మెట్రోరైలు అధికారలు స్పందిస్తూ.. సుల్తాన్పూర్ స్టేషన్ ఓవర్హెడ్ వైర్లో సమస్య తలెత్తడంతో సేవలు నిలిచిపోయాయనీ, దీంతో ఎల్లోలైన్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. పస్తుతం సాంకేతిక సమస్య తలెత్తిన మార్గంలో రోజుకు 8 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఢిల్లీ మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య రోజుకు 30 లక్షలుగససా ఉంది. ఈ సంగతి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దష్టికి రాగానే రవాణా శాఖ మంత్రిని అలర్ట్ చేసినట్టు ఆయన ట్వీట్ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని తాను కోరినట్టు ఆయన పేర్కొన్నారు.