Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో రాజకీయ అవినీతి విపరీతంగా ఉందని...ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు ఖరీదైన స్థలాలు, కాంట్రాక్టులను తాయిలాలుగా ఎరవేసి రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అలాగే కేసీఆర్ ఒత్తిళ్లకు లొంగి సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనానికి సంతకాలు చేశారంటూ 11 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు శ్రవణ్ దాసోజు, మానవతా రారు బుధవారం లోక్పాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నాయకుడు మానవతా రారు విలేకరుల సమావేశం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజరు కుమార్ 50 కోట్ల రూపాయల విలువ చేసే మమత మెడికల్ కాలేజీకి సంబంధించిన స్థలానికి అమ్ముడుపోయి టీఆర్ఎస్ పంచన చేరారని ఆయన విమర్శించారు. మహాకూటమి నుంచి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను కూడా ఖరీదైన భూమిని ఎరగా వేసి టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారని మానవతా రారు ఆరోపించారు. అలాగే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ తనకు రావాల్సిన రెండు వందల కోట్ల కాంట్రాక్టు బిల్లులకు లొంగిపోయి పార్టీ ఫిరాయించారని ఆయన పండిపడ్డారు.