Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత సాంప్రదాయాల ప్రకారమే కౌంటింగ్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించడం కంటే ముందుగానే వీవీప్యాట్లను పూర్తిగా లెక్కించాలని 22 ప్రతిపక్ష పార్టీలు చేసిన అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం తిసర్కరించింది. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. గతంలో తాము ఈవీఎంలనే ముందుగా లెక్కించామని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. అయితే, గతంలో అవలంభించిన విధానాన్ని పక్కనబెట్టి తాము నూతన పద్ధతిని అనుసరించలేమని వ్యాఖ్యానించారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు చేసేది లేదని వెల్లడించింది. అయితే, ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు తమకు ఫిర్యాదు చేశాయని ఈసీ అధికారులు ధవీకరించారు. కాగా, ఆయా పార్టీల నేతలు ఈ విధానంలో సాంకేతిక లోపం ఏంటో చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ వ్యాఖ్యానించింది. దాంతోపాటు వీవీప్యాట్లను 50 శాతం లెక్కించడం సాధ్యం కాదని వివరించింది. ప్రతిపక్ష పార్టీలు గతంలో ఈ విషయంపై తాము సమావేశాలు నిర్వహించినప్పుడు ఎటువంటి అభ్యంతరాలు వెల్లడించలేదని చెప్పింది. కేవలం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతే విపక్ష పార్టీలు ఈ విషయంపై ఫిర్యాదులు చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నట్టు.. కేవలం సాంపిల్గా ఒక అసెంబ్లీ స్థానానికి 5 వీవీప్యాట్లు లెక్కిస్తామన్నారు. తేడా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి లెక్కింపు ఉంటుందని అన్నారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామని వెల్లడించామని.. ఏ రాజకీయ పార్టీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
యూట్యూబ్లో ఎన్నికల ఫలితాలు లైవ్
ప్రసార భారతి, గూగుల్ సంస్థలు కలిసి గురువారం విడుదలకానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ప్రసార భారతి ఓ ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలను తెలుసుకునేందుకు లైవ్స్ట్రీమ్ను ఏర్పాటు చేయనున్నామని తెలిపింది. యూట్యూబ్ వెబ్సైట్, యాప్లలో గురువారం పతాక శీర్షికన డీడీన్యూస్-ఎన్నికల ఫలితాల సమాచారం లింక్ను సూచిస్తారు.