Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రత లేకుండా ఈవీఎంల తరలింపులు!
- ఈవీఎంలను మార్చే యత్నమంటూ ఆరోపణలుసరైన భద్రత లేకుండా, సంబంధిత దస్తావేజులు చూపకుండా ట్రక్కుల్లో ఈవీఎంల తరలింపునకు సంబంధించిన వీడియోలు దేశంలో తీవ్ర కలకలం సృష్టించాయి. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే ఈ తరలింపులు జరగడం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకూ విరుద్ధమే. అధికార పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్కు పాల్పడుతుందనే విపక్షాల అనుమానాలకుతోడు పోలైన ఈవీఎంల స్థానంలో వేరే ఈవీఎంలను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఊపందుకున్నాయి.
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ సందడి చేశాయి. పోల్స్ అన్ని ఎన్డీయేకే మొగ్గు చూపగా.. విపక్షాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. ఎగ్జిట్ పోల్స్ను నమ్మాల్సిన అవసరం లేదని చెబుతూ.. ఈవీఎంల తరలింపు, కౌంటింగ్లో అవకతవకలు చేయటం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఎగ్జిట్ పోల్స్ పనికొస్తాయని విపక్ష పార్టీల అధినేతలు వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లపై ఓ కన్నేసి ఉంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, వారు ఊహించినట్టుగానే ఈవీఎంల తరలింపునకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. భద్రత లేకుండానే ఈవీఎంలు తరలిస్తున్న వీడియోలు, అలాగే సరైన పత్రాలు చూపించకుండానే స్ట్రాంగ్ రూమ్ల లోకి వాహనాల్లో ఈవీఎంలు తరలించే వీడియోలూ అధి కార పక్షంపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి.
తరలింపులు : హర్యానాలోని ఫతేహాబాద్లో ఈవీఎం లను తరలిస్తున్న ఒక ట్రక్కు దస్తావేజులు చూపించుకుం డానే స్ట్రాంగ్రూమ్లోకి వెళ్లినట్టు ఓ వీడియోలో కనిపిం చింది. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు స్ట్రాంగ్రూమ్లోకి ఈవీఎంల తరలింపులు రాజకీయ ప్రతినిధుల సమక్షంలో జరగాలని ఈసీ మార్గదర్శకాలు చెబుతుండటం గమనార్హం. అలాగే బీహార్లోని సరన్, మహారాజాగంజ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈవీఎంలతో లోడ్ చేసిన ఓ జీపు స్ట్రాంగ్రూమ్కు సమీపంలో రహస్యంగా దాగి ఉన్నట్టు ఆర్జేడీ కార్యకర్తలు గుర్తించారని ఆప్ ఒక వీడియోను పోస్టు చేస్తూ ఆరోపించింది. ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో ఈవీఎంలను ఓ ట్రక్కు నుంచి దింపుతున్న వీడియో చక్కర్లు కొట్టింది. ఘాజీపూర్లోని ఓ స్ట్రాంగ్ రూమ్ నుంచి వాహనం నిండా ఈవీఎంలను తరలించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపిస్తూ బీఎస్పీ నేత అఫ్జల్ అన్సారీ ఆ రూమ్ ముందే ధర్నాకు దిగారు. అలాగే ఝాన్సీలో ఈవీఎంల తరలింపులపై ఎన్నికల అధికారి స్పందిస్తూ.. అవి రిజర్వ్ మిషిన్స్(ఈవీఎంలలో లోపం తలెత్తితే ముందు జాగ్రత్తగా అందుబాటులో పెట్టుకునే ఈవీఎంలు) అని తెలిపారు.
ఈసీ నిబంధనలు : పోలింగ్ ముగిసన తర్వాత పోలిం గ్కు ఉపయోగించిన ఈవీఎంలతోపాటు, రిజర్వ్ ఈవీఎం లను భద్రతా దళాల పరిధిలోనే ఉంచాలి. పోలైన ఈవీఎంలు రిసిప్ట్ సెంటర్కు పంపించిన సమయంలోనే రిజర్వ్ ఈవీఎంలనూ పంపించాలి. పోలైన ఈవీఎంలు, రిజర్వ్ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో వాటికి ప్రత్యేకంగా కేటాయించిన గదుల్లోనే భద్రపరచాలి. కాగా, ఈవీఎంల తరలింపులపై ఈసీ కొన్ని వివరణలు మార్గదర్శకాలకు భిన్నంగా ఉండటం చర్చనీయాంశమవుతున్నాయి.