Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని సహా కేంద్రమంత్రుల
ట్విట్టర్ ఖాతాల నుంచి తొలగింపు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పేరుకు ముందు పెట్టుకున్న 'చౌకీదార్'ను గురువారం బీజేపీ గెలిచిన కొద్ది క్షణాల్లోనే తొలగించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్లూ తమ ట్విట్టర్ ఖాతాల నుంచి కాపలాదారు పదాన్ని తొలగించారు. చౌకీదార్ను తొలగించిన తర్వాత మోడీ ట్విట్టర్లో స్పందిస్తూ.. 'ఇక ఇప్పుడు చౌకీదార్ స్ఫూర్తిని మరోస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. నా ఖాతాలో పేరకు ముందు ఆ పదం ఇక ఉండదు. కానీ అది నా మనసులో ఎప్పుడూ అంతర్భాగమే. మీరూ ఇలాగే చేయండని కోరుతున్నా' అని ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా మోడీ తనకు తాను కాపలాదారుడినని అభివర్ణించుకున్న విషయం విదితమే. ఈ దేశానికి తాను చౌకీదార్గా ఉంటానని చెప్పిన ఆయన.. ట్విట్టర్ ఖాతాలో ఆయన పేరును 'చౌకీదార్ మోడీ' అని మార్చుకున్నారు. దీనిని కేంద్రమంత్రులు సహా బీజేపీ పరివారమంతా పాటించింది. కాగా, ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన ఆ పదాన్ని తొలగించడం గమనార్హం.