Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీకే సింగ్ మాజీ సలహాదారు అరెస్ట్
ఘజియాబాద్: తెలంగాణలో సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ కేసు వెలుగులోకి వస్తే... తాజాగా కేంద్రమంత్రి లెటర్ ప్యాడ్తో పార్టీకి విరాళాలు సేకరించాడీ అమాత్యుల మాజీ సలహాదారుడు. బీజేపీకి విరాళంగా వచ్చిన సొమ్ము అపహరణ కేసులో కేంద్ర సహాయ మంత్రి వి.కె సింగ్ మాజీ సలహాదారు శంభు ప్రసాద్ సింగ్ను ఘజియాబాద్ పాత బస్టాండ్ ప్రాంతంలో సిహానీ గేట్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పార్టీకి వచ్చిన విరాళం మూడు లక్షల రూపాయలను తన సొంతానికి తీసుకున్నారనీ ఆరోపిస్తూ అజరు త్యాగి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారనీ ఘజియాబాద్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ తెలిపారు. కేంద్ర మంత్రి లెటర్ప్యాడ్ను ఉపయోగించి ప్రజల నుంచి విరాళాలు సేకరించాడనీ పోలీసులు చెప్పారు. ప్రజల నుంచి అక్రమంగా విరాళాలు సేకరించారనీ ఆయన పై ఇదివరకే కెేవీ నగర్ పోలీస్ స్టేషన్ లో సైతం కేసులు నమోదయ్యాయనీ పోలీసులు తెలిపారు. పార్టీ విరాళాల సేకరణకు ఎవరు అనుమతిచ్చారు.? సలహాదారుడు కేంద్రమంత్రి లెటర్ ప్యాడ్ వినియోగించి మరీ విరాళాలు వసూలు చేయటానికి వెనుకాడలేదంటే..పార్టీ పెద్దలు పురమాయించారా.? వాటాల రగడ వచ్చాకే కేసు ఠాణాకెక్కిందా..అని చర్చించుకుంటున్నారు.