Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెట్ మ్యాచ్ చూడటానికి వస్తే..ప్రేక్షకుల నినాదాలు
లండన్: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను ఎగ్గొట్టి... లండన్లో తలదాచుకున్న విజరు మాల్యాకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం భారత్-ఆస్ట్రేలియాల మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ను చూసేందుకు వచ్చాడు. ఈ సందర్భంగా విలేకర్లు ఆయన్ను మాట్లాడించేందుకు ప్రయత్నించగా ''నేను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చాను'' అని చెప్పి వెళ్లిపోతుండగా...భారత ప్రేక్షకులు మాల్యా చోర్..చోర్ అంటూ నినాదాలు చేశారు. గతంలో కూడా ఇలాంటి అనుభవం మాల్యాకు ఎదురైన సంగతి విషయం విదితమే. కాగా భారత్లోని బ్యాంకులకు వేలకోట్లను ఎగ్గొట్టిన కేసులో మాల్యా విచారణ ఎదుక్కొంటున్నారు. డియాజియోతో వివాదం కేసులో కూడా విజరు మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. దీంతో ఈ కేసులో 135 మిలియన్ డాలర్లను బ్రిటన్కు చెందిన డియాజియో గెలుచుకొంది. దీనికి అదనంగా వడ్డీ, కోర్టు ఖర్చులు కూడా మాల్యా చెల్లించాల్సి వచ్చింది. భారత్లోని బ్యాంక్లకు మాల్యా దాదాపు రూ.10వేల కోట్లకు పైగా బకాయి పడ్డాడు. ఈ మొత్తానికి సంబంధించిన భారత్లో దాఖలైన కేసుల విచారణ హాజరయ్యేలా అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దిగువ కోర్టులో భారత్ గెలిచింది. యూకే హౌం సెక్రెటరీ మాల్యాను అప్పగించేలా ఆదేశాలపై సంతకాలు చేశారు. దీనిపై మాల్యా అప్పీల్కు వెళ్లారు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు వెలువడనున్నది.