Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు నిందితులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని పాయల్తాడ్వి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు ఈనెల 21 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు డాక్టర్లు భక్తి మెహరే, హేమా అహుజా, అంకితా ఖండేల్వాల్ లు ప్రస్తుతం బైకుల్లా జైలులో ఉన్నారు. వారిపై ఇప్పటికే ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్, ఆత్మహత్యకు పురిగొల్పేలా చేయడం వంటి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మెడికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గిరిజన విద్యార్థిని పాయల్ తాడ్వి.. గతనెల 22న బీవైఎల్ నాయర్ ఆస్పత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గిరిజనురాలు అయినందునే తన కూతురును ఆముగ్గురు నిందితులు వేధింపులకు గురి చేశారని తాడ్వి తల్లిదండ్రులు ఆరోపించారు. పాయల్తాడ్వి శరీరం, ప్రయివేటు భాగాలలో గాయాలున్నాయని, చనిపోయేముందు ఆమె ఎంతగానో బాధను అనుభవించి ఉండొచ్చని బాధితురాలి తరఫు న్యాయవాది నితిన్ సాత్ప్యూత్ తెలిపారు.