Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చందానగర్ ప్రయివేటు హోటల్లో ఘటన
నవతెలంగాణ-మియాపూర్
పెండ్లికి పెద్దలు నిరాకరించారని ఇంటి నుంచి వచ్చేసిన ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ హైదరాబాద్ శివారులోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. స్థానికులు, పోలీసుల ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన లచ్చిరాం నాయక్ అదే ప్రాంతానికి చెందిన స్వర్ణలత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వారి వివాహానికి నిరాకరించడంతో ఈ నెల 7న ఇంటి నుంచి బయటకు వచ్చారు. చందానగర్లోని వీవీ ప్రైడ్ ప్రయివేటు హోటల్లో గది అద్దెకు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణలత తల్లిదండ్రులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీవీ ప్రైడ్ హోటల్లో ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్లారు. గది తలుపులు తెరిచి చూడగా ఇద్దరు అప్పటికే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు.