Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) నేతృత్వంలో తమిళనాడులో రేపు మానవహారం
చెన్నై : తమిళనాడులో హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్లకు వ్యతిరేకంగా నిరసన గళం ఊపందుకుంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులతో నష్టపోతున్న ఐదు డెల్టా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఈనెల 12న డెల్టా జిల్లాల్లో 600 కి.మీ వెంబడి మానవహారం ఏర్పాటుచేసి తమ నిరసనను తెలియజేస్తామని సీపీఐ(ఎం), రైతు సంఘం 'ఏఐకేఎస్' ప్రకటించాయి. ఈ నిరసనలకు ప్రతిపక్షాలు డీఎంకే, ఎండీఎంకే, సీపీఐ...తదితర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రజలకు, రైతాంగానికి జరిగే నష్టాన్ని తెలియజేయడం కోసం ఈనెల 6 నుంచి తంజావూర్, కడలోర్, నాగపట్నం, పుదుకొట్టై, తిరువూరు జిల్లాల్లో జీపు జాతాలను, బైక్ ర్యాలీలను సీపీఐ(ఎం) నిర్వహిస్తోంది.
అయితే ఈ నిరసనలు, ఆందోళనలను అడ్డుకునేందుకు ప్రభుత్వం 200మంది వామపక్ష కార్యకర్తలపై కేసుల్ని నమోదుచేసింది. హైడ్రోకార్బన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మొదట్నుంచీ సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు. డెల్టా జిల్లాలుగా పిలుచుకునే ఈ ఐదు జిల్లాల్లో ప్రాజెక్టుల కారణంగా పర్యావరణం, ప్రజల స్థితిగతులు, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటాయని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
అన్నీ లాక్కుంటున్నారు : పి.శన్ముగం, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు
ఈ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాయి. పెద్ద ఎత్తున భూమిని, నీటిని కేటాయిస్తూ ఇక్కడి రైతాంగానికి తీరని ద్రోహం చేస్తున్నాయి. ఈ సమస్యపై ప్రజల ఆందోళనలను తమిళనాడు సీఎం పట్టించుకోవటం లేదు. మౌనంగా ఉంటున్నారు.