Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూ సేకరణ చట్టానికి సవరణలపై..
బెంగళూరు : 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేస్తూ కర్నాటక సర్కారు తీసు కున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కదం తొక్కారు. రాష్ట్రంలోని చిక్బల్లాపూర్, హౌస్పేట్, బగల్కోట్ లలో రైతులు జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. కర్నాటక రాజ్య రైతు సంఘ (కెఆర్ఆర్ఎస్), 'హసిరు సెనె' ఆధ్వర్యంలో ఈ ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 13న రాష్ట్ర అసెంబ్లీ తీసుకొచ్చిన బిల్లును తామంతా వ్యతిరేకిస్తున్నామన్నారు. సవరణల ద్వారా బాధితులకు పరిహారంలో కోత, నిర్వాసితులయ్యేవారికి సరైన న్యాయం జరగదని ఆరోపిస్తూ వారు నిరసనలకు దిగారు. రక్షణ, మౌళికరంగం, ఆస్పత్రులు, పారిశ్రామిక కారిడార్ల పేరిట రైతుల వద్ద నుంచి త్వరలోనే ప్రభుత్వం భూమి సేకరించనుంది. దీనికోసమే సంబంధిత చట్టంలో సవరణలు చేశారని రైతులు వాపోతూ పోరాటాల బాట పట్టారు. పాత చట్టం మాదిరిగానే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారంతా రోడ్డెక్కారు.