Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో ప్రతిరోజు 26వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు
- నదులు, సముద్రాలకు చేరుతున్న 10వేల టన్నుల వ్యర్ధాలు
- రాష్ట్రాల తీరుపై కాలుష్య నియంత్రబోర్డు ఆగ్రహం
ఇండియాలో ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టులుగా పేరుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఏర్పడుతున్న ప్లాస్టిక్వ్యర్ధాలు 26వేల టన్నులు. ఇందులో 10వేల టన్నులు డంపింగ్యార్డ్లకు చేరటం లేదు. ఇదంతా నగరాల్లో బహిరంగ ప్రదేశాలకు, నదుల్లోకి, సముద్రంలోకి చేరుతోంది. ప్లాస్టిక్ వ్యర్ధాలలో ఢిల్లీ, ముంబయి, బెంగుళూరు, చెన్నై, కోల్కతా నగరాలు ముందున్నాయి.
న్యూఢిల్లీ : కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు తాగడానికి వాడే ప్లాస్టిక్ గొట్టపు పైపులు, ఆహార పదార్థాల ప్యాకింగ్ కోసం వాడే ప్లాస్టిక్ కప్పులు మినహా...ఇక దేంట్లోనూ ప్లాస్టిక్ వాడకమన్నది లేకుండా చేస్తామని గతేడాది 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' రోజున ప్రధాని మోడీ ప్రకటించారు. 2022కల్లా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించారు. అయితే అది కేవలం ప్రకటనగానే మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలోపు మనదేశం ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయే పరిస్థితి వచ్చేట్టు ఉంది. దాదాపు అన్ని నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఊరవతల రోడ్లపై పడేయటం సాధారణ విషయం అన్నట్టుగా మారిపోయింది.
ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ-2016 నిబంధనల్ని ఏ రాష్ట్రం కూడా అమలుచేయటం లేదనీ, తమ ఆదేశాల్ని పాటించటం లేదనీ 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' 25 రాష్ట్రాలకు లేఖలు రాసింది. నిబంధనలు అమలుజేయని రాష్ట్రాలపై చర్యలు చేపట్టేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు న్యాయస్థానానికి వెళ్లనున్నదని వార్తలు వెలువడ్డాయి. 1998లో సిక్కిం ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని ప్రకటించి, మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అయితే మిగతా రాష్ట్రాలూ సిక్కిం బాటలో నడిచినప్పటకీ, నిబంధనల అమలుపూర్తిస్థాయిలో జరపటం లేదు.
ఈస్థాయిలో ఉంటే...
ొటూత్ బ్రష్ల దగ్గర్నుంచీ డెబిట్ కార్డుల వరకూ నిత్యం ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్క ప్రకారం, ప్రతీరోజు మనదేశంలో తయారవుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు 26వేల టన్నులు.
ొఈ 26 వేల టన్నుల వ్యర్ధంలో 10వేల టన్నులు సముద్రాల్లో, నదుల్లో, భూమిలో కలుస్తోంది. పర్యవరణానికి ఇది పెనుముప్పును తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ొఈస్థాయిలో సముద్రాలకు ప్లాస్టిక్ వ్యర్ధాలు చేరితే, 2050నాటికి సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్ధాల బరువు చేపల బరువును మించిపోతుంది.
ొవిలిమా రోడ్రిగ్స్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సంస్థ 'సహాస్ జీరో వేస్ట్' సీఈఓ.
రిటైల్, ఆన్లైన్ సంస్థల నుంచి అత్యధికం
ఆన్లైన్ రిటైల్, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ప్లాస్టిక్ను పెద్దఎత్తున వాడుతున్నాయి. ఒక గులాబ్ జామ్ కావాలని ఆర్డర్ చేస్తే, చాలు...అది కూడా ప్లాస్టిక్ ప్యాకేజింగ్తో వచ్చేస్తోంది. నగరాల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్ వాడకానికి రిటైల్, ఆన్లైన్ రిటైల్ సంస్థలు కారణమవుతున్నాయి. ఆన్లైన్లో ఆహార సంస్థల నుంచి ప్రతీ నెలా 22 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఏర్పడుతున్నాయని ఒక సర్వే తేల్చింది.
అమెరికాలో తలసరి ప్లాస్టిక్ వాడకం 109 కిలోలు. భారత్లో 11 కిలోలు. ప్లాస్టిక్ వాడకంలో ఒక దేశం మరో దేశంతో పోటీ పడకూడదు. కాబట్టి మనదేశంలో ప్లాస్టిక్వాడ కాన్ని నియంత్రించాలి. భారత్లో ప్లాస్టిక్ పరిశ్రమ 2020నాటికి 22 మిలియన్ టన్నుల ఉత్పత్తు లను తయారుచేసే దిశగా ముందుకెళ్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై మనం జాగ్రత్తపడకపోతే దేశ పౌరుల రేపటి భవిశ్యత్తు ప్రమాదంలో పడుతుంది.