Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలుగురాష్ట్రాల సీఎంలకు సీపీఐ సూచన
నవ తెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తంగా ఉండాలని సీపీఐ కార్యదర్శి నారాయణ సూచించారు.ప్రధాని మోడీ ఇటీవల తిరుపతి పర్యటన ముగించుకొని వెళ్తూ ఐదేండ్లలో ఏపీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారనీ, తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారని తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఏపీ భవన్లో నారాయణ మీడియాతో మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అడుక్కోవాల్సిన పని లేదనీ, పోరాడి సాధించుకోవాలని సూచించారు.. తిరుపతిలోని రాష్ట్రీయ సాంస్కృతిక విద్యాపీఠ్లో అధ్యాపకుల నియామకంలో రిజర్వేషన్లు పాటించడం లేదనీ, ఈ విషయమై యూజీసీ చైర్మెన్ డీపీ సీంగ్ని కలిసి వినతి పత్రం అందజేశామని అన్నారు. యూజీసీ చైర్మెన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని మాట ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారని, ఎక్కువ ఎంపీలు గెలిస్తే కేంద్రంపై పోరాడి సాధిస్తామని జగన్ పేర్కొన్నారని గుర్తు చేశారు. హోదా విషయంలో సీట్లు సంఖ్య ప్రధానం కాదనీ, హోదా సాధిస్తామన్న సిద్ధాంతం ముఖ్యమని అన్నారు. హోదా కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పనిలేదనీ, పోరాడి సాధించుకోవాలని సూచించారు. హోదా పేరుతో ఎన్నికల్లో లబ్ది పొంది దాన్ని సాధించకుండా వదిలేయడం మంచిది కాదని హితవు పలికారు. జగన్ తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేస్తూ డైనమిక్ అనిపించుకుంటున్నాడనీ, అలాగే హోదా విషయంలో కూడా పోరాటం చేయాలని సూచించారు.