Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లో పెరుగుతున్న 'మెదడువాపు' కేసులు
పాట్నా: బీహార్లో గత రెండు నెలలుగా చిన్నారుల మత్యుఘోష కొనసాగుతోంది. మెదడువాపు (ఎన్సెఫలైటిస్) వ్యాధితో ఇప్పటివరకూ ఆ రాష్ట్రవ్యాప్తంగా 85 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే గడిచిన తొమ్మిది రోజుల్లోనే 50 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది. వ్యాధి సోకినవారి శరీరానికి అంగవైకల్యం సోకడం మరో విషాదం. ప్రాణాలు దక్కించుకున్నవారిలో 40 శాతం పిల్లలు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయితే ఆస్పత్రుల్లో ఇప్పటికీ చేరుతున్న బాధితులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. అయితే చిన్నారులు చనిపోవడానికి కారణం మెదడువాపు వ్యాధి కారణం కాదనీ ప్రభుత్వాధికారులు పేర్కొనడం గమనార్హం.
గత తొమ్మిది రోజుల్లోనే బీహర్లో 50 మంది పిల్లలు చనిపోయారు. సోమవారం ఒక రోజునే 20 మంది పిల్లలు చనిపోవడం దీని తీవ్రతను తెలిజేస్తోంది. ముజఫర్పూర్ లోని రెండు ఆస్పత్రుల్లో ఈ మరణాలు సంభవించాయనీ మంగళవారం కూడా మరో ముగ్గురు చిన్నారులు చనిపోయారనీ సమాచారం. వైశాలి జిల్లాలోని భగవాన్పూర్, హర్వాన్షాపూర్ గ్రామాల్లో పది మంది పిల్లలను మొదడువాపు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా వారందరూ మరణించారనీ స్థానిక పోలీసులు తెలిపారు. ఇప్పటికీి వందలల్లో పిల్లలు చికిత్స పొందుతున్నట్టు సమాచారం. తక్షణమే తగు చర్యలు తీసుకోవాలనీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికార యంత్రాంగాన్నీ అప్రమత్తం చేశారు.