Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ తాత్కాలిక కమిషనర్ (సీవీసీ)గా శరద్కుమార్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు సీవీసీగా విధులు నిర్వర్తించిన కె.వి చౌదరి, టి.ఎమ్ భాసిన్ల పదవీ కాలం ముగియడంతో శరద్కుమార్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీ నేతత్వంలోని సెలెక్షన్ ప్యానల్ మరో కొత్త కమిషనర్ను నియమించే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నట్టు సమాచారం. శరద్కుమార్ గతంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీయైన జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఐఏ) చీఫ్గానూ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మెన్గానూ విధులు నిర్వర్తించారు. గతేడాది జూన్ 12న విజిలెన్స్ కమిషనర్గా శరద్కుమార్ బాధ్యతలు చేపట్టారు. వచ్చే ఏడాది అక్టోబర్తో ఆయన పదవీ కాలం ముగియనుంది. కాగా, సీవీసీలో ఒక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఇద్దరు విజిలెన్స్ కమిషనర్లు ఉంటారు. వీరిని ప్రధాని నేతత్వంలో కేంద్ర హౌంశాఖ మంత్రి, లోక్సభ ప్రతిపక్షనేతతో కూడిన కమిటీ ఎన్నుకుంటుంది.