Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయుధ, సాంకేతిక వ్యవస్థల అభివృద్ధికి కేంద్రం గ్రీన్సిగల్
న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ భూ, జల, గగనతల పోరాటాలకు మాత్రమే పరిమితమైన భారత్ త్వరలో రోదసీ పోరుకు కూడా సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన అత్యాధునిక ఆయుధ, సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వీలుగా కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభు త్వం ఆమోదం తెలిపింది. 'రక్షణ రోదసీ పరిశో ధనా సంస్థ (డీఎస్ఆర్ఓ) పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్ష తన జరిగిన భేటీలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. కొద్దికాలం క్రితమే అత్యున్నత స్థాయిలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రభు త్వం సంయుక్త కార్యదర్శి స్థాయిలో వున్న శాస్త్రవేత్త సారధ్యంలో ఈ సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. త్రివిధ దళాలు, రక్షణ శాఖ అధికారుల సన్నిహిత సమన్వయంతో పరిశో ధనలు నిర్వహించే శాస్త్రవేత్తల బృందాన్ని ఈ సంస్థ కు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాధి పతులు సభ్యులుగా వున్న డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ (డీఎస్ఏ)కి ఈ సంస్థ పరిశోధన, అభివృద్ధి మద్దతును సమకూరుస్తుంది.