Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మంగళవారం నాడు వడగాలులు హడ లెత్తించాయి. ప్రత్యేకించి ఉత్తర భారత్లోని నాలుగు నగరాలలో అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి, రాజధాని నగరమైన ఢిల్లీతో మొదలై రాజస్థాన్లోని చురు, ఉత్తర ప్రదేశ్లోని బండా, అలహాబాద్ల్లో 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలను నమోదయ్యాయి. గడిచిన రెండు వారాలుగా చురులో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. సాధారణంగా ప్రతి ఏటా ఈ సమయంలో చురులో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. బండాలో 49.2 డిగ్రీలు, అలహాబాద్లో 48.9 , ఢిల్లీలో 49 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశం లో గత కొన్ని సంవత్సరాలుగా వడగాల్పులు పెరుగుతున్నాయి. 2004 -2019 మధ్య 15 సంవత్సరాల కాలంలో దాదాపు 11 ఏండ్లుగా వడ గాలులు కొనసాగాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.