Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి హామీని గ్రామీణ వ్యవసాయానికి అనుసంధానం అవసరం:
- కేంద్రానికి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి ఇంటింటికి మిషన్ భగీరథ పథకం పేరుతో నీరు అందిస్తుందనీ... దాని నిర్వహణ వ్యయం పెద్ద మొత్తంలో అయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఎండకాలంలో కూడా తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి నీరు ఇస్తున్నామన్నారు. ఇందు కోసం తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికలు వేసినట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టును అన్ని రాష్ట్రాల అధికారులు వచ్చి పొగుడుతున్నారని వివరించారు. మంగళవారం కేంద్ర జల వనరుల శక్తి శాఖ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ నిర్వహణపై సదస్సు ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సు అన్ని రాష్ట్రాల మంత్రులు పాల్గొనగా, తెలంగాణ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. అనంతరం ఆయన శాస్త్రీ భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్రం ఇలాంటి సదస్సు నిర్వహించడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ పథకంతో వల్ల వేసవి కాలంలో కూడా తాగు నీటి కొరత లేకుండా చేయగలిగామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెద్ద ఎత్తులో అప్పు అయిందని వివరించారు. తమ ప్రభుత్వంపై కొంతమేర భారం తగ్గించేందుకు భగీరథ ఖర్చులో సగం ఖర్చును భరించాలని కోరారు. కేంద్రం ఆర్ధిక సాయం రూపంలో అందించాలని అభ్యర్థించారు.
ఉపాధి హామీని అనుసంధానం చేయండి
ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుసంధానం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని అభ్యర్థించారు.
ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివ ృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో భేటి అయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అభివ ద్ధి పథకాలకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశాక.. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ కింద 175.18 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరారు. పంచాయితీ భవనాలు, రిపేర్లు, సాంకేతిక సామాగ్రికి నిధులు కావాలని అభ్యర్తించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 760 కోట్ల రూపాయల మెటిరీయల్ కాంపొనెంట్ నిధులు మంజూరు చేయాలని అడిగారు. ఈ పథకం కింద అంగన్వాడీ భవనాలు, శ్మశానవాటికలు, రోడ్లు నిర్మిస్తున్నట్టు వివరణ ఇచ్చారు. దాంతోపాటు,
14వ ఆర్థిక సంఘం ఫెర్ఫార్మెన్స్ గ్రాంట్ కింద 119.28 కోట్లు, గ్రాంట్ కింద 135.46 కోట్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల జనాభా 40 శాతం ఉన్న నేపథ్యంలో అంత్యోదయ మిషన్ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో అర్బన్ క్లస్టర్ కింద యూనిట్లను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.