Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2011-16 మధ్య అధికంగా చూపారు
- వాస్తవ సగటు వృద్ధి 4.5 శాతం మాత్రమే
- అంచనాల్లో చూపించింది మాత్రం 7 శాతం
- కొత్త విధానంతో.. సరికొత్త 'ఎత్తు'గడలు
- వాస్తవాలకు దూరంగా జీడీపీ మదింపు
- ఇప్పటికైనా వాస్తవాల్లోకి వస్తే మంచిది : పరిశోధన పత్రంలో మోడీ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రహ్మణియన్
న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాలను పక్కన బెట్టిన మన పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నట్టుగా మరోసారి నిరూపితమైంది. మళ్లి అధికారంలోకి వచ్చేందుకు.. ప్రత్యర్థుల కంటే తాము మెరుగైన వృద్ధిరేటును సాధించామని గొప్పలు చెప్పుకొని ఓట్లు దండుకొనేందుకు గాను దేశవృద్ధి రేటు అంచనాలనే తారు మారు చేసి చూపించారని సాక్ష్యాలతో సహా నిరూపితమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన మంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన అరవింద్ సుబ్రహ్మణియన్ తన పరిశోధన పత్రంలో వెల్లడించారు. యూపీఏ, ఎన్డీఏ హయాం లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఎక్కువ చేసి చూపిం చారని ఆయన తన పరిశోధన పత్రంలో వ్యాఖ్యానించారు. 2011-12 నుంచి 2016-17 మధ్య కాలంలో జీడీపీని ప్రభుత్వ వర్గాలు ఎక్కువ చేసి చూపించాయని తన పరిశోధనా పత్రంలో సాక్ష్యాలతో సహా వెల్లడించారు. జీడీపీ లెక్కింపు పద్ధతుల్లో తేడాల వల్లే అసలు కంటే 2.5 శాతం ఎక్కువగా జీడీపీని అంచనా వేశారని ఆయన తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన ప్రచురించిన ''ఇండియాస్ జీడీపీ మిస్ ఎస్టిమేషన్: లైక్లీ హుడ్, మ్యాగ్నిట్యూడ్, మెకానిజం, ఇంప్లికేషన్'' అనే పరిశోధనా పత్రంలో ఆయన తెలిపారు. 2011-12, 2016-17 మధ్య కాలంలో ఖచ్చితమైన సూక్ష్మ గణాంకాలను పరిగణనలోకి తీసు కొని లెక్కిస్తే భారత వృద్ధి రేటు సరాసరి 4.5 శాతంగా ఉందని, కానీ ప్రభుత్వ వర్గాలు మాత్రం ఏడు శాతానికి చేరువలో ఉన్నట్టుగా వెల్లడిం చాయన్నారు.2011-12 నుంచి భారత్ జీడీపీ లెక్కింపు కోసం పరిగణ నలోకి తీసుకొనే సమాచారంతో పాటు విధానాలలో మార్పులు తీసుకు వచ్చిందని.. అధిక అంచనాలకు ఇదే కారణమని తెలిపారు. ఇందుకు అనేక ఆధారాలున్నాయని ఆయన తన ఆ పరిశోధనా పత్రంలో వెల్లడించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేత త్వంలోని తొలి ప్రభు త్వం ఈ మార్పు చేసింది.
దీంతో మోడీ హయాంలో ఎక్కువ వృద్ధి జరిగి నట్టుగా సర్కారు అంచనాలను వెల్లడించింది. దీనిపై అప్పట్లోనే దాదాపు 108 ప్రధాన ఆర్థికవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస ్థకు సంబంధించిన సూక్ష్మ గణాంకాలు పేలవమైన వృద్ధిని కనబరుస్తున్న నేపథ్యంలోనూ ఆర్థిక వ్యవస్థ సగటున 7 శాతం వృద్ధిని నమోదు చేయ డం సాధ్యంకాదని వారు అప్పట్లోనే విశ్లేషించిన సంగతి తెలిసిందే. అయి తే ప్రభుత్వం ఈ వాదనను అప్పట్లోనే తోసిపుచ్చింది. మోడీ సర్కారు తీసుకువచ్చిన కొత్త జీడీపీ మదింపు విధానంపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు పెరుగుతున్న వేళ అరవింద్ ప్రచురించిన పరిశోధన పత్రంతో వాస్తవ పరిస్థితలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత వృద్ధిరేటుపై ప్రపంచ వ్యాప్తంగా కొత్త అనుమానాలు మొదలయ్యాయి.
మోడీ సర్కారు 'ఎత్తు'గడలు..
ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతతో పాటు మందగమనం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు 2015లోనే జీడీపీ అంచనాలను మర్చేందుకు మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 2015 జనవరి మాసంలో వృద్ధిరేటు లెక్కింపునకు బేస్ ఇయర్గా అప్పటి వరకు పాటిస్తూ వస్తున్న 2004-05 సంవత్సరాన్ని మార్చేస్తూ 2011-12ను ప్రామాణిక సంవత్సరంగా ప్రకటించింది. దీనిని వాడుకలోకి తీసుకుంటూ పోయిన సంవత్సరం సుదీప్తో మండల్ కమిటీ నివేదిక అనుసారం 2004-05 నుంచి 2011-12 మధ్య కాలంలో కాంగ్రెస్ హయాంలోని యూపీఏ సర్కారు వెల్లడించిన జీడీపీ గణాంకాలను తక్కువ చేసి చూపించింది. 2011 వరకు దేశీయ ఉత్పత్తుల తయరీ విలువకు పారిశ్రామికోత్పత్తి సూచీలో తయారీ విభాగానికి దగ్గరి సహసంబంధం ఉండేదని ఆయితే 2011 తరువాత నుంచి ఆధికారులు చేసే లెక్కల్లో ఈ సంబంధం పూర్తిగా దూరమైపోయిందని సుబ్రహ్మణ్యం తెలిపారు. తాజా వార్తల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం గణాంకాల విషయంలో పాటిస్తున్న సత్యదూరమైన విధానాలతో కలత చెందే ప్రధాన మంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు పదవి నుంచి అరవింద్ సుబ్రహ్మణియన్ ముందుగానే వైదొలగినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ఆయన పదవీ కాలం 2019 మేతో ముగియ వలసి ఉన్నప్పటికీ ఆయన గతేడాది ఆగస్టులోనే వ్యక్తిగత కారణాలను సాకుగా చూపుతూ ముందుగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవిక విధానాలను అనుసరించాలి..
భారత దేశంలో డేటా జనరేషన్తో జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, దేశ ప్రతిష్ఠను పునరుద్ధరించేందుకు ఇప్పటికైన కృషి జరగాల్సి ఉందని ఆయన వివరిచారు.. జీడీపీ, ఉపాధి కల్పన, ప్రభుత్వ ఖాతాలు వంటివాటిని పరిశీలించేందుకు 'నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్'కు చట్టపరమైన స్వాతంత్య్రాన్ని ఇవ్వాలన్నారు. దీనికి తోడు సాంకేతికంగా, వ్యక్తిగతంగా పేరు, ప్రఖ్యాతలు ఉన్నవారిని దీనికి అధినేతగా నియమించాలని ఆయన సర్కారుకు సూచించారు. భారత్ వేగవంతమైన వృద్ధి కోసం వాస్తవిక విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణియన్ అభిప్రాయపడ్డారు