Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్తంభానికి కట్టేసి మహిళపై దాడి
- కర్నాటకలో ఘటన
బెంగళూరు: అప్పు తీసుకుని, తిరిగి చెల్లించకుండా పారిపోయిందనే నెపంతో ఓ మహిళను నడిరోడ్డుపై స్థంభానికి కట్టి ఆపై దాడిచేసిన అమానవీయ ఘటన కర్నాటకలోని కొడిగిహల్లిలో గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన పోలీసులు వెంటనే ఈ చర్యకు పాల్పడిన ఏడుగురు నిందితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. చామరాజనగర్ జిల్లాకు చెందిన రాజమణి కొంతకాలంగా కొడిగిహల్లిలో ఉంటూ చిన్న హౌటల్ నడుపుకుంటోంది. ఆమె స్త్రీశక్తి పొదుపు సంఘం నుంచి 50 వేల రూపాయల రుణం తీసుకుని ఊరి విడిచి పారిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నెలరోజుల తర్వాత గ్రామానికి తిరిగి వచ్చిన ఆమెను కొందరు వ్యక్తులు విద్యుత్ స్థంభానికి కట్టేశారు. డబ్బు తిరిగి చెల్లించాలంటూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలో రాజమణి నిస్సహాయ స్థితిలో ఉండగా.. ఆమెను చెప్పు, చీపుర్లతో కొట్టండి అని ఓ వ్యక్తి అరుస్తున్నట్టుగా వుండటం గమనార్హం.