Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ శ్రీధరన్
- జోక్యం చేసుకోవాలని ప్రధానికి లేఖ
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడమనేది సరైన నిర్ణయం కాదని ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాజీ చీఫ్ శ్రీధరన్ అభిప్రా యపడ్డారు. దీనిపై ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి శుక్రవారం లేఖ రాశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్యే ఢిల్లీ మెట్రో, బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించొచ్చంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో మహిళలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధరన్ ప్రధానికి లేక రాయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. డీఎంఆర్సీతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా మెట్రో ప్రాజెక్టులో భాగస్వామిగా ఉందని శ్రీధరన్ గుర్తుచేశారు. అలాంటి సమయంలో మరొక షేర్ హౌల్డర్ అభిప్రాయం తెలుసుకోకుండా ఒక్కరే ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఉచిత ప్రయాణం వల్ల ఢిల్లీ మెట్రో నష్టాల బాటపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తే దేశంలోని ఇతర మెట్రోలు ఉన్న నగరాల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలనే డిమాండ్ ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఢిల్లీ మెట్రోకు వచ్చే నష్టాలను ప్రభుత్వం పూడుస్తుంది అని చెప్పడం సరికాదన్నారు. మెట్రో నెట్వర్క్ విస్తరించేకొద్దీ ఈ రెవిన్యూ పెరుగుతూ పోతున్నదనీ అలాంటప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి నష్టాలను ఢిల్లీ ప్రభుత్వం పూడుస్తుందనీ శ్రీధరన్ అన్నారు. a