Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన మన్మోహన్ పదవీకాలం
- లోక్సభ ఎన్నికల్లో ఓటమితో దేవెగౌడ దూరం
- 17 నుంచి పార్లమెంటు తొలి సెషన్స్
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈనెల 17 నుంచే పార్లమెంటు బడ్జెట్ తొలి సమావేశాలు ప్రారంభంకాను న్నాaయి. అయితే ఈ సారి జరగబోయే బడ్జెట్ సమావేశాలకు మాత్రం దేశ మాజీ ప్రధానులైన దేవెగౌడ, మన్మోహన్లు మాత్రం హాజరు కాలేకపోతున్నారు. కారణం.. రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ పదవీ కాలం ముగిసిపోగా, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేవెగౌడ ఓటమి చెందడమే. పెద్దలసభ అయిన రాజ్యసభకు గత 30 ఏండ్లుగా మన్మోహన్ ఎన్నికవుతూ వస్తున్నారు. చివరిసారిగా 2013లో అసోం నుంచి రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. ఆయన ఆరేండ్ల పదవీకాలం ఈ ఏడాదితో ముగిసిపోయింది. దీంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు మన్మోహన్ దూరం కానున్నారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ-1, యూపీఏ-2 హయాంలో మన్మోహన్ ప్రధానిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక దక్షిణాది నుంచి ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి జేడీ(ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఆయన 1996 జూన్ నుంచి 1997 ఏప్రిల్ మధ్య భారత్కు 11వ ప్రధానిగా పనిచేశారు. ఇటీవల 17వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఆయన ఎప్పుడూ పోటీచేసే హసన్ ఎంపీ స్థానం నుంచి కాకుండా తముకూరు నుంచి పోటీచేశారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం దేవెగౌడ ఓటమిని చవిచూశారు.
పార్ల మెంటు సమావేశాలకు హాజరుకావాలంటే లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడైనా అయి ఉండాలి. కానీ, లోక్సభ ఎన్నికల్లో దేవెగౌడ ఓడిపోవడంతో లోక్సభ మెట్లను ఎక్కే అవకాశాన్ని కోల్పోయారు. ఈ కారణంతో దేవెగౌడ బడ్జెట్ సమావేశాలకు హాజరుకా లేకపోతున్నారు. రాజ్యసభలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న మన్మోహన్, లోక్సభలో ఒక మాజీప్రధానిగా ఇన్ని రోజుల తన అనుభవాన్ని ధారబోసిన జోడించిన దేవెగౌడ లాంటి మాజీ ప్రధానులు ఈ సారి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు లేకపోవడం వెలితే అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడు తున్నారు.