Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో 10గ్రాముల ధర రూ.34వేలు
ముంబయి : ఇటీవల కాలంలో బంగారం ధర పెరగని రోజు లేదు. హైదరా బాద్తో సహా దేశంలోని వివిధ నగరాల్లో శనివారం నాటికి 10గ్రాముల బంగారం ధర రూ.34వేలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి పతనం ధరలు నిత్యం పెరగడానికి దారితీశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. శుద్ధమైన 24క్యారట్ల తులం బంగారం దాదాపు రూ.40వేలకు చేరుకోవటం కొనుగోలుదారుల్ని హడలెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లలో ఒడిదొడుకులు, డాలర్ పతనం, రూపాయిపై అమ్మకం ఒత్తిడి కొనసాగటంతో గతకొద్ది రోజులుగా బంగారం ధరలు పై పైకి వెళ్లటం జరుగుతోంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూ నెలకొన్న రాజకీయ సంక్షోభం, చమురు ధరలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య పోరు...మొదలైనవి బంగారానికి డిమాండ్ను పెంచాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు బంగారంవైపు మరలటమూ ధరల పెరుగుదలకు దారితీసిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థలో మందగమనం, అక్కడి కేంద్ర బ్యాంక్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారంపై మార్కెట్లలో సెంటిమెంట్ను పెంచినట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై ఆంక్షలు, చైనాతో అమెరికా ట్రేడ్వార్ మనదేశంలోని బులియన్ (బంగారం స్టాక్మార్కెట్) మార్కెట్ను ప్రభావితం చేశాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.