Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు ప్రధాన నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపి ప్రగ్యా సింగ్ ఠాకూర్కి ప్రత్యేక కోర్టు మినహాయింపులిచ్చింది. కేసు విచారణలో భాగంగా శనివారం కోర్టు ఎదుట హాజరు నుంచి ఆమెకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఆమె తరపు న్యాయవాదులు అంతకు ముందు మురబయి కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపడుతున్న ప్రత్యేక జడ్జి వి ఎస్ పదాల్కర్ శనివారం గైర్హాజరు అవ్వడంతో, తాత్కాలిక న్యాయమూర్తి ఆమోదం తెలిపారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.