Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ,రాష్ట్రాల మధ్య అర్థవంతమైన ఫెడరలిజం అవశ్యం
- ప్రధాని మోడీ, మంత్రి గడ్కరీతో కేరళ సీఎం విజయన్ భేటీ
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా.. అర్థవంతమైన ఫెడరలి జాన్ని అవలంభించాలని కేరళ ముఖ్య మంత్రి పినరరు విజయన్ అభిప్రాయ పడ్డారు. అప్పుడే పరిపాలనకు సంబం ధించి ఎటువంటి సమస్యలు తలెత్తవనీ, దాంతో దేశ ప్రజానీకానికి
లాభం చేకూరుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల హక్కులను ఏమాత్రం హరించకూడదని అన్నారు. అయితే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేంద్ర పథకాల్లో (సెంటర్ స్పాన్పర్డ్ స్కీమ్లు) ఎక్కువ శాతం పథకాలన్నీ సమాఖ్య విధానానికి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయనీ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోగ్యవంతమైన విధానాన్ని దెబ్బ కొడుతుందని వివరించారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నిటి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం విజయన్ ఢిల్లీకి చేరుకున్నారు. సమావేశం కంటే ముందే ఆయన ప్రధాని మోడీ, కేంద్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా గత సంవత్సరం రాష్ట్రంలో సంభవించిన అకాల వర్షం, వరదల కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయనీ వారికి వివరించారు. అందుకు సంబంధించిన అంశాలతో కూడిన ఒక మెమోరాండాన్ని ప్రధాని మోడీ, గడ్కరీకి వేర్వేరుగా కేరళ ముఖ్యమంత్రి అందజేసినట్టు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. కేరళ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయన్ మాట్లాడుతూ.... కేరళలో కొన్ని ప్రత్యేక సమస్యలను 15వ ఆర్థిక సంఘం దష్టికి తీసుకువచ్చామనీ అయితే వాటిని నిటి ఆయోగ్ ముందుకు సదరు ఆర్థిక సంఘం చూపించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవ సమస్యలను ఈ విధంగా జాబితా నుంచి తీసివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణాళిక సంఘం ఎత్తి వేసిన తర్వాత ఏర్పాటు చేసి నిటి ఆయోగ్లో రాష్ట్రం నుంచి ఎక్కువ పన్నులు కడుతున్నప్పటికీ, అవసరం మేర రాష్ట్రాలకు తిరిగి రావడం లేదని వివరించారు. గాడ్గిల్ ఫార్ములకు అనుగుణంగా కేంద్రం నిధులు ఇచ్చే పద్ధతి లేదని చెప్పారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం ద ష్టికి తీసుకువచ్చామనీ, నిటి ఆయోగ్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్టు చెప్పారు.