Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: ఎండల తీవ్రతకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు ఆదివారం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం దుగ్గుదుర్రులో ఆదివారం వడగాల్పులు ఓ వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... దుగ్గుదుర్రుకు చెందిన దుప్పలపూడి అన్నవరం(58) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రెండు రోజులుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని తహశీల్దార్ లక్ష్మీ కళ్యాణి, విఆర్ఒ గోపాలరావు పరిశీలించారు.ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలో వడదెబ్బకు ఇద్దరు మృతి చెందారు. కందుకూరు రోడ్డులో అరుణ కాలనీలో నివాసం ఉంటున్న బచ్చు పున్నయ్య(70), మూలగుంటపాడు గ్రామానికి చెందిన పువ్వాడి సత్యవతి(48) ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లాలో వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. ఈపూరు మండలంలోని శ్రీనగర్కు చెందిన వై.చిన్నక్క (65) ఎండల తీవ్రతకు అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. ఫిరంగిపురం మండలం తాళ్లూరులో జూపల్లి లీలమ్మ(60) వడదెబ్బకు మృతిచెందింది.