Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాగులో జారి ఇద్దరు యువకులు మృతి
మారేడుమిల్లి (తూర్పుగోదావరి): విహారయాత్రకు వచ్చి వాగులో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వాలమూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గోకవరం మండలం రంపయర్రంపాలేనికి చెందిన జుత్తుగ నరేష్ (24), గోకవరానికి చెందిన గేదెల సీతారామ్(22), బంటుమిల్లి నానిబాబు ద్విచక్రవాహనంపై మారేడుమిల్లి మండలం వాలమూరు విహారయాత్రకు వెళ్లారు.
అనంతరం పాములేరు వాగులో నరేష్, సీతారామ్ స్నానానికి దిగారు. కొద్దిసేపటికి వారు వాగులో నీటి ఉధృతికి కొట్టుకుపోతుండగా స్నేహితుడు నానిబాబు వారిని రక్షించేందుకు కర్రను అందించేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ వారు వాగులో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న రంపచోడవరం ఎఎస్పీ రాహుల్దేవ్సింగ్, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్ఐలు నున్న రాజు, జి.సతీష్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. గ్రామంలోని గిరిజన యువకులు బాలకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి, సురేష్రెడ్డి సాయంతో వాగులో నరేష్, సీతారామ్ కోసం గాలించారు. కొద్దిసేపటికి మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలముకుంది.