Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్
- నెల రోజులు ట్రాఫిక్ నిలిపివేత
అమరావతి : కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు డిసెంబర్ నెలాఖరుకు పూర్తి చేసే విధంగా కాంట్రాక్ట్ సంస్థకు గడువు విధించామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఉన్నతాధికారులతో కలిసి ఫ్లై ఓవర్ పనుల పురోగతిని ఆదివారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఈ ఫ్లై ఓవర్ విజయవాడ-హైదరాబాద్ మార్గం లో ప్రయాణించే ప్రజలకు అత్యంత ప్రాముఖ్యమైందని, అందుకే త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలని సీఎం సూచించారని తెలిపారు.
ఫ్లై ఓవర్ నిర్మాణానికి నెల రోజుల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ నిలిపివేయాల్సి ఉంటుందని, ప్రజలు సహకరిస్తే రూ.500 కోట్ల ప్రాజెక్టు పనులను ఈ ఏడాది చివరకు పూర్తి చేస్తామని చెప్పారు. అధికారులు కూడా పనులు నాణ్యంగా జరిగేలా చూస్తారన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభు త్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఫ్లై ఓవర్ పనులు పూర్తి కాలే దన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేస్తా మన్నారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్టి కృష్ణబాబు మాట్లాడుతూ ఫ్లై ఓవర్ పనులు 85 శాతం పూర్తయ్యాయన్నారు. కొత్త వయాడక్ట్ సాంకేతికతతో కొత్త డిజైన్ల వల్ల ఒక సంవత్సరం ఆలస్యమైందన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకూ రూ.233 కోట్లు నిధులు విడుదలయ్యాయని, ఇంకా రూ.100 కోట్లు రావాల్సి ఉందని చెప్పారు. పనులు చేయడానికి నిధుల సమస్య లేదన్నారు. భూ సేకరణ కోసం రూ.114 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, వయాడక్ట్కి రూ.12 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అదనపు పనులు చేయడం వల్ల రూ.25 కోట్ల భారం పడిందన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎస్సీ జాన్మోషే, రోడ్లు, భవనాల శాఖ ఇఎన్సి రాజీవ్రెడ్డి, కేంద్ర ప్రభుత్వ రీజినల్ రవాణా అధికారి ఎస్కె సింగ్ తదితరులు పాల్గొన్నారు.