Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెదడువాపుóతో ప్రాణాలొదిలిన ఇద్దరు చిన్నారులు
- బీహార్లో ఆగని పసిమొగ్గల మరణాలు
పాట్నా: బీహార్లో ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ముందే మెదడు వాపు వ్యాధితో ఇద్దరు చిన్నారులు ప్రాణాలొదిలారు. ఈ ఘటన శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఎస్కేఎమ్సీహెచ్) లో ఆదివారం చోటుచేసుకుంది. బీహార్లో మెదడువాపు వ్యాధి బారినపడి అనేక మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం..ఎస్కేఎమ్సీహెచ్, కేజ్రీవాల్ ప్రయివేటు ఆస్పత్రుల్లో కలిపి ఇప్పటికే 82 మంది చిన్నారులు మృతిచెందారు. ఒక్క శనివారమే మెదడువాపు వ్యాధి లక్షణాలతో 61 మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరారు. దాంతో పై రెండు ఆస్పత్రుల్లో కలిపి మొత్తం 93 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హర్షవర్ధన్ ఎస్కేఎమ్సీహెచ్ ఆస్పత్రిలో ఆదివారం పర్యటనకు వచ్చారు. ఆయన పలువురు చిన్నారుల తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెబుతుండగానే మరో పక్క ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఐదేండ్ల చిన్నారి, ఏడేండ్ల బాలిక ప్రాణాలొదిలారు. దాంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. మంత్రి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతూ. ఎప్పటికప్పుడూ పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపారు. ఇది ఇలా ఉండగా వడగాలుల ధాటికి ఆదివారం ఒక్క రోజే 45 మంది చనిపోయారు.