Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: కర్నాటక ప్రభుత్వం చేపట్టనున్న 102 కిలో మీటర్ల ఎలివే టెడ్ కారిడర్ను అడ్డకోవాలనీ బెంగళూరు వాసులు భారీ సంఖ్యలో 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' (ఎన్జీటీ)ను కలిశారు. ఈ భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనగళాన్ని వినిపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గత మార్చిలో ముఖ్యమంత్రి కుమారస్వామి.. కొంతమంది నిరసనకారులను కలిసి మాట్లాడుతూ.. ప్రజలను సంప్రదించి, వారి మద్దతుతోనే ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్తామని ఇచ్చిన హామీని వారు గుర్తుచేశారు. సీఎం తన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన కొంతమంది పౌరులు మాట్లాడుతూ.. కుమారస్వామి లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్ట్పై పౌర సంఘాలను, ట్రాఫిక్ నిపుణులను, ఇతర ప్రతినిధులను కలిసి అభిప్రా యాన్ని తీసుకుంటామని తెలిపినట్టు గుర్తుచేశారు. కానీ ఎన్నికల అనంతరం మాటమార్చి బహిరంగ చర్చకు రావాలని అంటున్నారని మండిపడ్డారు.