Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలిక 'శుద్ధికరణ' కోసం గ్రామపెద్దలకు విందు ఇవ్వనందుకే..
- మధ్యప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం
భోపాల్ : మధ్యప్రదేశ్ల ఖాప్ పంచాయతీల ఆగడాలకు హద్దే లేకుండా పోతున్నది. నిమ్న కులానికి చెందిన వ్యక్తి లైంగికదాడి చేశాడు కాబట్టి.. కూతురి శుద్ధికరణ కోసం గ్రామ పెద్దలకు మాంసంతో విందునివ్వాలని బాధితురాలి కుటుంబాన్ని ఆదేశించారు. పొట్టపోసు కోవడానికి నానాతిప్పలు పడుతున్న బాధితురాలి కుటుంబం విందునివ్వ కపోవడంతో సామాజికంగా వెలివేశారు. మధ్యప్రదేశ్లో రాజ్గఢ్లోని దుంగర్పూర్ గ్రామంలో ఫిబ్రవరిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిమ్న కులానికి చెందిన ఓ వ్యక్తి ఆధిపత్య కులపు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఫిబ్రవరి మొదటివారంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసినట్టు ఎస్పీ ప్రదీప్ శర్మ ధ్రువీకరించారు. కాగా, పోలీసు ఫిర్యాదుతో ఈ ఘటన బహిరంగ మైందని గ్రామ పెద్దలు ప్రకటిస్తూ.. ప్రజలను సంతుష్టి చేసేందుకు, అలాగే, నిమ్న కులపు వ్యక్తి అఘాయిత్యానికి గురైన బాలిక శుద్ధికరణ కోసం 'పెద్ద మనుషుల'కు మాంసంతో విందునివ్వాలని బాధిత కుటుంబాన్ని ఆదేశించారు. విందునిచ్చేందుకు అంగీకరించినట్టు ఓ లేఖపై బాధితురాలి తండ్రి సంతకం తీసుకున్నారు. ఆ విందు ఏర్పాటు చేసేవరకు సదరు కుటుంబం సామాజిక బహిష్కరణలోనే ఉంటుందని పేర్కొన్న ఆ లేఖపై 150 నుంచి 200మంది గ్రామస్తులు, పక్క గ్రామీణు లూ సంతకాలు చేశారు. ఇక అప్పటి నుంచి బాధిత కుటుంబం వెలిని అనుభవిస్తూనే ఉన్నది. ఊరిలోని ఏ కార్యక్రమానికి వారిని పిలవడం లేదు. బాధిత కుటుంబం ఏ పండుగ చేసినా.. వేడుకకు రాకపోవడం కాదు, ఆహ్వాన పత్రాన్ని కూడా స్థానికులు తీసుకోలేరు. దీంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ కుటుంబం చివరికి అధికారులను ఆశ్రయించింది. అధికారులు రంగంలోకి దిగి.. విచారిస్తున్నారు. ఒక సామాజిక వర్గాన్ని మొత్తం విచారించాల్సి ఉండటంతో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి దాని ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసు అధికారి తెలిపారు.