Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సార్వత్రిక ఎన్నికల సమయంలోనే 76శాతం కొనుగోలు
- వాటి విలువ రూ. 4,444 కోట్ల పైనే
- ఆర్టీఐ ద్వారా బహిర్గతం
న్యూఢిల్లీ : రాజకీయపార్టీలకు విరాళాలు అందించడం కోసం ఉద్దేశించిన 'ఎలక్టోరల్ బాండ్లు' లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపాయా ?అంటే అవుననే సమాధానం వినబడుతున్నది. మోడీ సర్కారు తీసుకొచ్చిన ఈ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు కేవలం లోక్సభ ఎన్నికల సయంలోనే అధికంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే 76శాతం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు జరిగింది. ఈ విషయం సమాచార హక్కు ద్వారా(ఆర్టీఐ) వెలుగుచూసింది. ఈ సమాచారాన్ని మధ్యప్రదేశ్లోని నీమాచ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ బయటపెట్టారు. గతేడాది మార్చి నుంచి మొత్తం పదిదశలలో రూ. 5,851.41 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు దేశంలో జరిగింది. ఇందులో మొదటి ఏడుదశల్లో 2018 మార్చి నుంచి 2019, జనవరి 24 మధ్య రూ.1,407 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగాయి. అయితే ఇంత విలువ చేసే ఎన్నికల బాండ్లను కేవలం ఓ అనామక వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గుర్తింపు పొందిన పలు బ్రాంచ్ల నుంచి కొనుగోలు చేసినట్టు ఆర్టీఐ ద్వారా వెలుగుచూసింది. ఈ వివరాలు వెల్లడించటానికి ఎస్బీఐ నిరాకరిస్తున్నది. ఇటీవల లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో మాత్రం ఎలక్టోరల్ బాండ్ల కొనుగోళ్లు అమాంతంగా పెరిగిపోవడం గమనార్హం. మార్చి 1 నుంచి మే 10 మధ్య చివరి మూడు దశలలో రూ. 4,444.32 కోట్ల విలువ చేసే ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు జరిగింది. అంటే మొత్తం ఎన్నికల బాండ్ల విలువలో ఇది 76శాతం అన్నమాట. వీటిలో అత్యధికంగా బీజేపీకి కార్పొరేట్లు కాసుల వర్షం కురిపించారని సమాచారం. ఎస్బీఐ గుర్తింపు పొందిన వివిధ బ్రాంచ్ల ద్వారా గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మే 10 వరకు మొత్తం పదిదశలలో ఎన్నికల బాండ్లను అమ్మడా నికి కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య మొత్తం ఏడు దశలలో లోక్సభ ఎన్నికలు జరిగిన విష యం తెలిసిందే. ఈ తరుణంలో మే6 నుంచి 15 వరకు పదోదశ ఎలక్టో రల్ బాండ్ల అమ్మకానికి ప్రకటన చేసింది. అనంతరం మే 10వరకు మా త్రమే అమ్మకాలు చేపట్టనున్నట్టు కేంద్రం ప్రకటన చేయడం గమనార్హం.