Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇనుప రాడ్లు కుప్పకూలి ముగ్గురు కార్మికులు మృతి
బెంగళూరు : బెంగళూరు వాటర్ సప్లరు అండ్ సెవరేజ్ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ సైట్లో ప్రమాదం చోటుచేసుకున్నది. నిర్మాణంలో ఉన్న గ్యాస్ ప్రొడక్షన్ డోమ్ సెంటరింగ్ ఐరన్ రాడ్లు ఒక్కసారిగా కూలిపోయి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన లుంబినీ గార్డెన్స్కు ఎదురుగా ఉన్న నాగావారాలో ఉదయం 11 గంటల 15 నిమిషాలకు చోటుచేసుకున్నది. ఈ ఘటనలో మరో ఆరుగురు కార్మికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్పించగా ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 23 మంది కార్మికులు పనిలో ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరి సహాయక చర్యలను చేపట్టాయి. కాగా, ఈ ఘటనపై అమృతహల్లి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ప్రమాదం వెనకగల కారణం కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని పోలీసులు తెలిపారు. ఈ మేరకు వారు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. బోర్డు అధికారులపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనా ప్రదేశాన్ని రాష్ట్ర మంత్రి క్రిష్ణ బైరె గౌడ సందర్శించారు.