Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ చార్జీలను పెంచుతూ యోగి సర్కార్ ప్రతిపాదనలు
లక్నో: యూపీలో యోగి సర్కార్ ప్రజలకు కరెంట్ షాక్ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకుంది. ఒక్కసారిగా గృహౌపరకణ విద్యుత్పై 25శాతం, వాణిజ్యరంగం విద్యుత్పై 10 నుంచి 15 శాతం వరకు చార్జీలను పెంచుతూ ప్రతిపాదనలను చేసింది. ప్రస్తుతం గృహరంగం విద్యుత్ వినియోగానికి మొదటి 150 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్కు 4.90 రూపాయలుండగా.. దీనిని యూనిట్కు రూ .6.20 గా పెంచనున్నారు. అదేవిధంగా వాణిజ్య రంగంలోని విద్యుత్ వినియోగానికి ఒక్కో యూనిట్పై 10 నుంచి 15 శాతం వరకు చార్జీలను పెంచనున్నారు. ఇప్పటికే యూపీపీసీఎల్ నూతన ప్రతిపాదనల ఆమోదం కోసం యూపీ విద్యుత్ నియంత్రణ కమిషన్కు పంపింది. త్వరలో ఈ కమిషన్ ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రజాభిప్రాయాన్ని తీసుకోనుంది.
ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలను అధికంగా పెంచడం వల్ల మధ్య, అల్ప వర్గాలపై అధిక ప్రభావం పడనున్నదని విమర్శించారు. దిగువ, అల్ప వర్గాల జీవనంపై ఆర్థికభారం పెరుగుతుందని అన్నారు. సమర్థవంతమైన పాలన అందించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. యోగి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక యూనిట్ విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచలేదని విమర్శించారు. సమాజ్వాదీ అధికారంలో ఉన్నప్పుడు 9,000 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్టు గుర్తు చేశారు. రాష్ట్ర వినియోగానికి 24000 మెగావాట్ల విద్యుత్ అవసరముందని కానీ ఆ వినియోగానికి అనుగుణంగా యోగి సర్కార్ ఉత్పత్తి చేయలేకపోతున్నన్నారు. విద్యుత్ చార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని యూపీ విద్యుత్ వినియోగదారుల మండలి చైర్మెన్ అవదేశ్ కుమార్ వర్మ వ్యతిరేకించారు.