Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ నామా
నవ తెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పార్టీ ఎంపీలమంతా సమన్వయంగా పని చేస్తామని టీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఫ్లోర్ లీడర్ నామానాగేశ్వర్రావు అన్నారు. తాము మంగళవారం ప్రమాణస్వీకారం చేస్తామని అన్నారు. పార్లమెంట్ సమావేశం తర్వాత నామా మీడియాతో ముచ్చటించారు. విభజన సంబంధిత విషయాల్లో రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పోరాడతామన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేత నుంచి తమకు మార్గదర్శకాలు అందాయని అన్నారు. ఏ అంశంపై ఏ పోరాడాలన్న దానిపై స్పష్టత వచ్చిందన్నారు.