Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్లో చిన్నారుల మరణాలపై సామాజిక కార్యకర్త ఫిర్యాదు
పాట్నా: బీహార్లో మెదడువాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారుల సంఖ్య 117కు చేరింది. ఈ విషయమై కేంద్రం, బీహార్ ఆరోగ్య శాఖ మంత్రులపైన సోమవారం ముజాఫర్పూర్ ఛీప్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్లో కేసు నమోదైంది. వ్యాధికి కారణమైన అక్యూట్ ఎన్సిఫలైటిస్ సిండ్రోమ్పై అవగాహన కల్పించడంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్థన్ విఫలమయ్యారని బీహార్కు చెందిన సామాజిక కార్యకర్త తమన్నా హష్మీ ఫిర్యాదు చేశారు. కేంద్రమంత్రితో సహా, రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి మంగల్ పాండే పేరును కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ముజఫర్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 323, 308, 504 ప్రకారం కేసు ఫైల్ చేశామని పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పెద్ద సంఖ్యలో పిల్లలు మతి చెందుతున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నెల 24న పిటిషన్పై ముజాఫర్పూర్ కోర్టు విచారణ చేపట్టనున్నట్టు సమాచారం.