Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమిత్షాకు ఆర్జేడీ చురకలు
న్యూఢిల్లీ:'సర్.. దయచేసి మెదడువాపు వ్యాధి పైనా స్ట్రైక్ చేయండి. దాదాపు 200 మంది చిన్నారులు ఆ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు' అంటూ రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ దాని అధికారిక ట్విట్టర్ ఖాతాలో అమిత్ షాకు చురకలంటించింది. ప్రపంచ కప్లో భాగంగా భారత్, పాక్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో పాక్పై భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పాక్పై భారత క్రికెట్ జట్టు మరో స్ట్రైక్ చేసిందంటూ పోస్ట్ చేశారు. బీహార్లో మెదడువాపు వ్యాధి బారిన పడి కేవలం 16 రోజుల్లోనే వందమందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్లో అంతమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నా నోరు మెదపని అమిత్ షా క్రికెట్లో భారత్ జట్టు గెలిచినందుకు స్పందించడం దారుణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లాలూ యాదవ్ పార్టీ సోమవారం పై విధంగా చురకలంటించినట్టు తెలుస్తోంది.