Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ మేజర్ మృతి
- మరో అధికారి సహా ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్మూకాశ్మీర్ : కాశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత మోగుతోంది. దక్షిణ కాశ్మీర్లో జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం భీకరకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరో అధికారితో పాటు ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో అనంతనాగ్ జిల్లాలోని అచబల్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది సోమవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించింది. అయితే ఓ ఇంట్లో దాక్కొని ఉన్న ఉగ్రమూక.. భద్రతా సిబ్బందిని గమనిం చింది. అనంతరం వారిపై ఒక్కపెట్టున కాల్పులకు దిగింది. ప్రతిచర్యగా ఆర్మీ కూడా ఉగ్రవాదులపై ఎదురుదాడికి దిగింది. ఎన్ కౌంటర్లో గాయ పడినవారిని శ్రీనగర్లోని 92 ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నదని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. 'ఈ ఎన్కౌంటర్లో ఆర్మీ జవాను ఒకరు మరణించారు. ఆర్మీకి చెందిన మరో అధికారితో పాటు ఇద్దరు జవాన్లకూ గాయాలయ్యాయి. వారిని శ్రీనగర్లోని ఆస్పత్రికి తర లించాం. ఆర్మీ మేజర్ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహిస్తాం. అనంత రం మృతదేహాన్ని వారి కుటుంబసభ్యులకు అందజేస్తాం. ఉగ్ర వాదుల దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు' అని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈనెల 12న భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు పోలీసులు అమరులైన విషయం తెలిసిందే.