Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బీహార్లో మెదడువాపు వ్యాధి మరణాల పట్ల సీపీఐ(ఏం) పొలిట్బ్యూరో ఆవేదనను వ్యక్తం చేసింది. చిన్నారుల చావులను ఆపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే 100 మందికి పైగా చిన్నారులు చనిపోయారనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొ నాలనీ ఓ ప్రకటనలో తెలిపింది. బీహార్ సీపీఐ(ఏం) రాష్ట్ర కార్యదర్శి నేతృత్వంలోని బృందం వైద్యులను, బాధితులను కలిసి ప్రస్తుత పరిస్థితు లను తెలుసు కున్నట్టు పేర్కొంది. ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు వందల్లో ఉన్నారని తెలిపింది. వారందరికీ మెరుగైన వైద్యం అందించా లని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబాలకు ప్రగాఢ సాను బూతి తెలుపుతూ... చిన్నారుల మరణాలు తగ్గించేందుకు తమ వంతు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పొలిట్బ్యూరో పేర్కొంది.
వైద్యులకు రక్షణ కల్పించండి : ఐద్వా
న్యూఢిల్లీ: దేశంలో వైద్యులకు రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ (ఐద్వా) డిమాండ్ చేసింది. అలాగే బెంగాల్లో వైద్యులపై జరిగన దాడులను ఖండిస్తున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. వైద్యుల భద్రతకు భరోసానిస్తూ ప్రస్తుతం బెంగాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని డిమాండ్ చేసింది. మమత ప్రభుత్వం తీరు బాధ్యతారాహిత్యంగా ఉన్నదనీ పేర్కొంది. ఈ వైఖరిని విడనాడాలని సూచించింది. భవిష్యత్తులో వైద్యులపై దాడులు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. వైద్యులకు రక్షణ కల్పించే విషయంలో కొత్త చట్టం తీసుకురావడానికి కేంద్రం చర్యలు తీసుకోవాని కోరింది. అలాగే వైద్యుల పని గంటలు తగ్గించాలని తెలిపింది. రోగులకు సరిపడా మరింత మంది వైద్యులను నియమించాలని సూచించింది. తద్వారా రోగులకు మెరుగైన వైద్యం అందించడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొంది.