Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రియుడిపై యాసిడ్ దాడి
న్యూఢిల్లీ : పెండ్లికి నిరాకరించాడని ఓ ప్రియుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేసింది. ఈ ఘటన ఢిల్లీలోని వికాస్పురిలో ఈ నెల 11న జరగగా..ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం వికాస్పురిలో ఉంటున్న వీరివురు మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ యువతి యువకుడి వద్ద పెండ్లి ప్రస్తావన తీసుకవచ్చింది. కానీ ఆ యువకుడు ఆమె నిర్ణయాన్ని నిరాకరించాడు. దీంతో సదరు యువతి.. అతనిపై కోపం పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడింది. ఈ నెల 11న వారివురు బైక్పై వెళ్తున్న తరుణంలో..అతడ్ని హెల్మెట్ తీయాలని ఆమె కోరింది. దీంతో అతను హెల్మెట్ తీయగా.. తన వెంట తెచ్చుకున్న యాసిడ్తో అతడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆ యువకుడికి ముఖం, మెడ, ఛాతిపై గాయాలు కాగా.. ఆమె చేతికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరిద్దరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం తమపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులకు యువతి వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఆమె వాంగ్మూలం పై పలు అనుమానాలు రాగా.. కోలుకున్న ఆ బాధిత యువకుడిని విచారించడంతో అసలు విషయాన్ని పోలీసులు గ్రహించారు. దీంతో నిందితురాలిని నుంచి వాస్తవాన్ని రాబట్టారు. అనంతరం ఆమెపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.