Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈవీఎం వినియోగాన్ని రద్దు చేయాలంటూ పిల్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తక్షణ విచారణ సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. కోర్టు సెలవుల అనంతరం ఈ పిల్ను విచారించనున్నట్టు సుప్రీం తెలిపింది. ఈవీఎంల ద్వారా ఎన్నికలను నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలనీ, తాజా సార్వత్రిక ఎన్నికలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలని కోరుతూ ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా ఈ పిటిషన్లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని పలు నిబంధనలను కూడా ప్రశ్నించారు. ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే ఉపయో గించాలని పిల్ లో కోరారు. ఇదే తరహాలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలపై అనుమానాలను వ్యక్తం చేస్తూ.. ఈవీఎంల తోపాటు వీవీప్యాట్లను 100శాతం లెక్కించాలని 22 ప్రతిపక్ష పార్టీల నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. కానీ బీజేపీ మాత్రం ఈ నిర్ణయాన్ని ఖండించింది.