Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-117కు చేరిన 'మెదడువాపు' మృతుల సంఖ్య
- బాధిత కుటుంబాలకు 4లక్షల ఎక్స్గ్రేషియా
పాట్నా: బీహార్లో మృత్యుఘోష ఆగడం లేదు. మెదడువాపు వాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. సోమవారం నాటికి ఈ వ్యాధితో చనిపోయిన పిల్లల సంఖ్య 117కు చేరింది. ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పిల్లలు 300లకు పైగా ఉన్నారని సమాచారం. చనిపోయిన వారిలో 100 మంది చిన్నారులు కేవలం ఒక్క ముజాఫర్పూర్ ప్రాంతానికే చెందిన వారుండటం గమనార్హం. కాగా 12 మంది వైశాలికి చెందిన వారున్నారు. మిగతవారు మోతిహరి, పాట్నా, బెగూసరయి ప్రాంతాలకు చెందిన చిన్నారులు ఉన్నారు. ఆ రాష్ట్ర సీఏం నితిష్ కుమార్ చనిపోయిన చిన్నారుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
కొత్తగా ఈ వ్యాధిబారిన పడిన 13 మంది చాన్నారులు సోమవారం ఆస్పత్రిలో చేరగా, వారిలో ముగ్గురు ప్రాణాలొదిలారని శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ ఆండ్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి హర్షవర్ధన్ , బీహార్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అశ్విని చౌబేతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులను, బాధిత కుటుంబాలను కలిసి ప్రస్తుత వివరాలు తెలుసుకున్నారు.
నితీష్ కుమార్ మాట్లాడుతూ.. వైద్యుల సూచనలు పాటించాలనీ, పిల్లలను ఖాళీ కడుపుతో పడుకోనివ్వదని తెలిపారు. అలాగే సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పిల్లల్లో పోషకాహార లోపం కారణంగా, తీవ్రమైన వేడి, శారీరంలో గ్లూకోజ్ శాతం పడిపోయిన కారణంగా మరణాలు సంభవిస్తున్నాయనీ ప్రాథమిక సమాచారం అందిందని ఆయన తెలిపారు.